Crime రోజురోజుకీ సమాజం ఎలా మారిపోతుంది బయట తిరగాలి అంటేనే భయమేస్తుంది. ఎప్పుడు ఎవరు ఎలా ప్రవర్తిస్తారో తెలియకుండా పోతుంది. క్షనికావేశంలో ఎన్నో ఘోరాలకు పాల్పడుతున్నారు.. అలాగే మాస్క్ ధరించండి అని చెప్పినందుకు ఒక వ్యక్తి పెట్రోల్ బంక్ క్యాషియర్ను తుపాకితో కాల్చి చంపాడు. చివరికి కటకటాల పాలయ్యాడు.. ఈ ఘటన జర్మనీలో చోటుచేసుకుంది.
కరోనా పూర్తిగా తగ్గిపోయింది అనటానికి లేదు.. కొన్ని దేశాల్లో ఇప్పటికీ కరోనా విజృంభిస్తూనే ఉంది. అలాగే జర్మనీలో కూడా కరోనా ఎక్కువగా ఉంది. అందుకే అక్కడ కరోనా దృష్ట్యా వ్యాక్సినేషన్ ఉద్యమం ప్రారంభమైంది. అందులో భాగంగా అక్కడ ఉండే జర్మన్లందరూ మాస్క్ ధరించడం తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే మారియో ఎన్ అనే వ్యక్తి సిక్స్ ప్యాక్ బీర్ను కొనుగోలు చేసేందుకు ఒక స్టోర్కి వెళ్లాడు. అప్పుడు ముసుగు ధరించాడు.
అయితే ఆ కొనుగోలు తర్వాత మాస్క్ తీసేసి పెట్రోల్ బంక్ వద్దకు వచ్చాడు. అక్కడ క్యాషియర్గా పనిచేస్తున్న 20 ఏళ్ల విద్యార్థి మాస్క్ ధరించండి అని చెప్పాడు. అంతే కోపంతో అతని నుదిటి పై పాయింట్ బ్లాక్లో గన్పెట్టి పేల్చాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన జర్మనీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. నిందితుడు మారియో తుపాకినీ అక్రమంగా కలిగి ఉన్నందుకు గానూ జర్మన్ పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అంతేగాదు జర్మన్ కోర్టు అతన్నిదోషిగా నిర్ధారించి జీవత ఖైదు విధించింది.